కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి: టీడీపీ
ABN , First Publish Date - 2021-06-17T05:09:26+05:30 IST
ముఖ్యమంత్రి జగన్కు రాయలసీమ అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని టీడీపీ కర్నూలు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
కర్నూలు(అగ్రికల్చర్), జూన్ 16: ముఖ్యమంత్రి జగన్కు రాయలసీమ అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని టీడీపీ కర్నూలు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన శ్రీశైలానికి వెళ్లారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. కేంద్రంతో మాట్లాడి హైకోర్టును తీసుకురావడంలో సీఎం జగన్, వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు విఫలమయ్యారని ఆరోపించారు. సీఎం జగన్ కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం లేదని, కేవలం తనపై సీబీఐ కోర్టులో ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడానికే ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోందని సోమిశెట్టి ఆరోపించారు. కరోనా మహమ్మారి కారణంగా చనిపోయిన మృతుల కుటుంబాలను ముఖ్యమంత్రి జగన్ తక్షణమే ఆదుకోవాలని, ఆ కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రూ.25 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. నాయకులు నాగేంద్ర కుమార్, నారాయణ రెడ్డి పాల్గొన్నారు.