6 నెలల్లో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం: జ్యోతుల నెహ్రూ
ABN , First Publish Date - 2021-03-08T05:05:15+05:30 IST
కిర్లంపూడి, మార్చి 7: 20 నెలల్లో రాష్ట్రానికి సంబంధించి లక్షాయాభై వేలకోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందని,
కిర్లంపూడి, మార్చి 7: 20 నెలల్లో రాష్ట్రానికి సంబంధించి లక్షాయాభై వేలకోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందని, అందుకే మరో 6 నెలల్లో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జ్యోస్యం చెప్పారు. ఎస్ తిమ్మాపురంలో ఆదివారం టీడీపీ నాయకులు కానూరి గంగాధర్, నామసాని తాచు, సోము నారాయణరావు, గొంటెల శ్రీను ఆధ్వర్యాన పురం హరీష్ తన అనుచరులతో నెహ్రూ సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ మండలాధ్యక్షుడు చదరం చంటిబాబు, భూపాలపట్నం గ్రామ సర్పంచ్ వీరంరెడ్డి కాశిబాబు సమక్షంలో భారీ సంఖ్యలో టీడీపీలో చేరికలు జరిగాయి. జరగబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని నెహ్రూ కోరారు. కార్యక్రమంలో గొడె బాల, తూము కుమార్, గుడాల రాంబాబు, బొదిరెడ్ల సుబ్బారావు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు గండికోట నాగేశ్వరరావు, మందేటి ముంగర్లయ్య బాబి ఉన్నారు.