డీసీసీబీ అవినీతి అక్రమాలపై చర్చకు సిద్ధం: Dhulipalla

ABN , First Publish Date - 2022-03-19T17:44:00+05:30 IST

డీసీసీబీ లో రెండు ఏళ్లుగా మంజూరు చేసిన అన్ని రకాల రుణాలు వివరాలు బహిర్గతం చేయాలని టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.

డీసీసీబీ అవినీతి అక్రమాలపై చర్చకు సిద్ధం: Dhulipalla

గుంటూరు: డీసీసీబీ లో రెండు ఏళ్లుగా మంజూరు చేసిన అన్ని రకాల రుణాలు వివరాలు బహిర్గతం చేయాలని టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... వినుకొండ అక్రమాలపై చైర్మన్  రాము కొత్తగా చెప్పింది ఏమీ లేదన్నారు. చైర్మన్ రాము వక్తిగత ఆస్తుల వివరాలు అడగటం లేదని... రుణాల వివరాలు మాత్రమే అడుగుతున్నామని తెలిపారు. విశ్వసనీయత... నిజాయితీ ఉంటే సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాయాలని డిమాండ్ చేశారు.


డీసీసీబీ అవినీతి అక్రమాలపై  చర్చకు సిద్ధమని ధూళిపాళ్ల స్పష్టం చేశారు. కానీ మాకు రుణాల వివరాలు పంపి  చర్చలు కోరాలన్నారు. ప్రభుత్వం దయపై నామినేట్ అయిన చైర్మన్ ఎక్కువ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను సంగం డైయిరీకి ఎన్నికైన చైర్మన్‌ అని తెలిపారు. ప్రభుత్వ అక్రమాలపై మాట్లాడిన ప్రతిసారి సంగం డైయిరీపై ఆరోపణలు చేయడం వైసీపీ చిల్లర నాయకులకు ఫాషన్‌గా మారిందని ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-03-19T17:44:00+05:30 IST