లోకేష్ను అడ్డుకోవాలని చూడడం సరికాదు: Dhulipalla
ABN , First Publish Date - 2021-09-09T13:37:06+05:30 IST
గుంటూరు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపట్ల ఆ పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: గుంటూరు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపట్ల ఆ పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించే హక్క ప్రతిపక్షాలకు లేదా? అని ప్రశ్నించారు. రమ్య హత్య కేసును రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. వైఎస్ వర్థంతికి లేని కరోనా నిబంధనలు... బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాయా అని నిలదీశారు. అన్యాయానికి గురైన కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చే నారా లోకేష్ను అడ్డుకోవాలని చూడడం సరికాదని ధూళిపాళ్ళ అన్నారు.