అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) ముఖ్య అనుచరుడు ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(Ananta uday bhaskar) డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపబడితే సాక్షి పత్రికలో కనీసం వార్త ప్రచురించలేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు(Devathoti nagaraju) అన్నారు. ముఖ్యమంత్రి పత్రికలో దళితులకు స్థానం లేదా ..?!... అసలు దళితులు సాక్షి పత్రిక ఎందుకు చదవాలి..? అని ప్రశ్నించారు. దళితులు, మేధావులు సాక్షి పత్రికను బహిష్కరించాలని అన్నారు. సుబ్రమణ్యం మృతిపై జ్యూడిషియల్ విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి పాలనలో దళితుల పరిస్థితి ఏ విధంగా ఉందో దళితులు ఇప్పటికైనా గ్రహించాలని దేవతోటి నాగరాజు అన్నారు.
ఇవి కూడా చదవండి