విద్యుత్ వినియోగదారులకు సర్కార్ కొత్త షాక్: Devineni
ABN , First Publish Date - 2021-09-14T15:40:43+05:30 IST
రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ... విద్యుత్ వినియోగదారులకు సర్కార్ కొత్తషాక్ ఇచ్చారన్నారు. నిరంతర ప్రక్రియగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఎలాంటి ఛార్జీల పెంపు చేయమని అబద్దపు హామీలు చెప్పారన్నారు. 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.11,500కోట్లు ప్రజలపై భారం మోపారని దేవినేని ఉమా ట్వీట్ చేశారు.