యడ్లపాటి భౌతికకాయం వద్ద దేవినేని ఉమా నివాళులు

ABN , First Publish Date - 2022-03-02T15:41:11+05:30 IST

టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు భౌతికకాయానికి మాజీ మంత్రి దేవినేని ఉమా నివాళులు అర్పించారు.

యడ్లపాటి భౌతికకాయం వద్ద దేవినేని ఉమా నివాళులు

గుంటూరు: టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు భౌతికకాయానికి మాజీ మంత్రి దేవినేని ఉమా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో సుదీర్ఘమైన, అరుదైన వ్యక్తి వెంకట్రావు అని అన్నారు. వ్యవసాయం పట్ల,  రైతుల పట్ల ఎంతో అంకితభావంతో పోరాటం చేశారని తెలిపారు. రైతులు, పార్టీ, ప్రజలు, సమస్యల పట్ల నిరంతరం పోరాటాలకు పాటుపడ్డారన్నారు. చేపట్టి పదవులకు వన్నె తెచ్చిన నేత యడ్లపాటి అని కొనియాడారు. అందరితో ఆప్యాయంగా మాట్లాడి ఆశీర్వదించే గొప్ప వ్యక్తి అని అన్నారు. పాడి పరిశ్రమకు సంఘం డైరీ లాంటివి స్థాపించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. యడ్లపాటి వెంకట్రావు చిరస్థాయిగా అందరి మనసుల్లో నిలిచిపోయారని దేవినేని ఉమా అన్నారు. 


నివాళులు....

యాడ్లపాటి భౌతికకాయానికి  వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు అన్నాబత్తుని శివకుమార్, మెరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లికార్జున రావు నివాళులు అర్పించారు. 

Updated Date - 2022-03-02T15:41:11+05:30 IST