ఏపీలో సంక్రాంతి కళ తప్పింది: దేవినేని ఉమా

ABN , First Publish Date - 2022-01-12T21:10:55+05:30 IST

సీఎం జగన్ అసమర్థ పాలన కారణంగా ఏపీలో సంక్రాంతి కళ

ఏపీలో సంక్రాంతి కళ తప్పింది: దేవినేని ఉమా

విజయవాడ: సీఎం జగన్ అసమర్థ పాలన కారణంగా ఏపీలో సంక్రాంతి పండుగ కళ తప్పిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. నగరంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి కానుకలను పేదలకు అందించామన్నారు. అయితే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పండుగలకు పేదలకు కానుకలు అందించలేకపోతోందని ఆయన ఆరోపించారు. జగన్‌రెడ్డి 36 నెలల పరిపాలనలో 3.86 లక్షల కోట్ల అప్పును చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ డబ్బును ఏ సంక్షేమ పథకాలకు ఎంతెంత ఖర్చు చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాడ్ చేశారు. 

Updated Date - 2022-01-12T21:10:55+05:30 IST