డ్రగ్స్ వ్యవహారంలో మళ్లీ జాతీయస్థాయిలో ఏపీ పేరు: Devineni
ABN , First Publish Date - 2021-10-24T18:59:15+05:30 IST
.‘‘డ్రగ్స్ వ్యవహారంలో మళ్లీ జాతీయస్థాయిలో ఏపీ పేరు. ఏపీ నుండి విదేశాలకు సరఫరా చేస్తూ, కర్ణాటకలో పట్టుబడ్డ కోట్ల విలువైన మాదకద్రవ్యాలు. ప్రశ్నించిన టీడీపీ కార్యాలయాలు, నేతలపై దాడులకు తెగబడ్డారు. నేడు అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన ఏపీ డ్రగ్ వ్యవహారంపై ప్రజలకు సమాధానం చెప్పండి జగన్’’
అమరావతి: రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవిను ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘డ్రగ్స్ వ్యవహారంలో మళ్లీ జాతీయస్థాయిలో ఏపీ పేరు. ఏపీ నుండి విదేశాలకు సరఫరా చేస్తూ, కర్ణాటకలో పట్టుబడ్డ కోట్ల విలువైన మాదకద్రవ్యాలు. ప్రశ్నించిన టీడీపీ కార్యాలయాలు, నేతలపై దాడులకు తెగబడ్డారు. నేడు అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన ఏపీ డ్రగ్ వ్యవహారంపై ప్రజలకు సమాధానం చెప్పండి జగన్’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.