రాజధానిపై మీ సలహాదారు ప్రకటన దేనికి సంకేతం?: దేవినేని
ABN , First Publish Date - 2021-01-15T18:32:30+05:30 IST
రాజధాని పట్ల ప్రభుత్వ వ్యవహారశైలిపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అమరావతి: రాజధాని పట్ల ప్రభుత్వ వ్యవహారశైలిపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘న్యాయస్థానాల్లో కేసులున్నా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న కార్యాలయాల తరలింపు, నాలుగు నెలల్లో రాజధాని మారుతుందని మీ సలహాదారు ప్రకటన దేనికి సంకేతం? వ్యవస్థలను నిర్వీర్యంచేస్తూ విశాఖలో మీ నేతలు దోచుకున్న భూములు అమ్ముకోవడం కోసమే రాజధాని మార్పు డ్రామాలంటున్న ప్రజలమాట వాస్తవం కాదా?’’ అని దేవినేని ట్వీట్ చేశారు.