పెంచుకుంటూ... పోవడమంటే ఇదేనా?: దేవినేని
ABN , First Publish Date - 2021-06-17T13:47:24+05:30 IST
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన కొత్త పన్ను విధానంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అమరావతి: ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన కొత్త పన్ను విధానంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ఇన్నాళ్లూ అద్దె ఆధారంగా పన్ను ఇక రిజిస్ట్రేషన్ విలువపై అంచనా వేస్తారట, ఏటా పెంచుకుంటూ పోతారట ! మున్సిపల్ ఎన్నికల్లో నమ్మించి, ఓట్లు వేయించుకొని ఇప్పుడు మోసం చేస్తారా? అండగా నిలవాల్సిందిపోయి ఆర్థికభారం మోపుతారా ? పెంచుకుంటూ... పోవడమంటే ఇదేనా ? ప్రజలకు సమాధానం చెప్పండి వైయస్ జగన్’’ అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు.