రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తారా?: దేవినేని

ABN , First Publish Date - 2020-07-09T14:55:45+05:30 IST

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తారా?: దేవినేని

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తారా?: దేవినేని

అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్‌ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘5సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు అరెస్టులో అడుగడుగునా హక్కుల ఉల్లంఘన. శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తిని 600 కిలో మీటర్లు వాహనంలో తరలింపా? దారిపొడవునా రక్తస్రావం. రాజకీయ కక్షసాధింపు కోసం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు లచేస్తారా? ఇందుకేనా ఒక్కఛాన్స్ అడిగింది సీఎం జగన్ గారు’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-07-09T14:55:45+05:30 IST