కరోనా బాధితుల ఆక్రందనలు వినపడటం లేదా జగన్ గారు?: దేవినేని

ABN , First Publish Date - 2020-07-06T15:18:45+05:30 IST

కరోనా బాధితుల ఆక్రందనలు వినపడటం లేదా జగన్ గారు?: దేవినేని

కరోనా బాధితుల ఆక్రందనలు వినపడటం లేదా జగన్ గారు?: దేవినేని

అమరావతి: రాష్ట్రంలోని కొవిడ్‌-19 ఆస్పత్రుల్లో అందించే భోజనం, సౌకర్యాలు అధ్వానంగా ఉండటం పట్ల టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘రాష్ట్రంలో ఎన్నిక్వారంటైన్ సెంటర్లు నడుస్తున్నాయి. పౌష్టికాహారం పేరుతో కాంట్రాక్టర్లకు ఎంత చెల్లిస్తున్నారు? మెనూ వివరాలు ఏంటి? గత వందరోజుల్లో క్వారంటైన్‌లో ఎంతమంది ఉన్నారు? మంచి నీళ్లు, మందులైనా ఇస్తున్నారా? నాణ్యతలేని ఆహారం తినలేమంటున్న బాధితుల ఆక్రందనలు మీకు వినిపించడంలేదా సీఎం జగన్ గారు’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 




Updated Date - 2020-07-06T15:18:45+05:30 IST