పొలాల మధ్య, స్మశానాల మధ్య స్థలాలా?: దేవినేని

ABN , First Publish Date - 2020-07-01T14:09:33+05:30 IST

పొలాల మధ్య, స్మశానాల మధ్య స్థలాలా?: దేవినేని

పొలాల మధ్య, స్మశానాల మధ్య  స్థలాలా?: దేవినేని

అమరావతి: ఏపీలో పేదలకు స్థలాల కేటాయింపులో వైసీపీ నేతల అవకతవకలపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘పెద్దల రేట్ల కోసం పేదలు "సెంటుపట్టా"కు గుట్టలెక్కాలా? వంతెనలు దాటిస్తూ, డ్యాముల్లో దింపుతూ పొలాల మధ్య, స్మశానాల మధ్య  స్థలాలా? ఉపాధి పనుల్లో యంత్రాలా? ఉపాధి నిధులతో మట్టి కొనుగోలా? చదునుకు 2613కోట్లు. వైసీపీ నాయకుల జేబుల్లోకి 1560కోట్లు వెళ్లాయని ప్రజలంటున్నారు సమాధానం చెప్పండి జగన్ గారు’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.



Updated Date - 2020-07-01T14:09:33+05:30 IST