సీపీఎస్ ఉద్యోగులు చెల్లించిన వాటా డబ్బు ఏమైంది?: దేవినేని

ABN , First Publish Date - 2021-08-21T14:55:03+05:30 IST

సీపీఎస్ ఉద్యోగులతో ప్రభుత్వ చెలగాటమాడుతోందంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సీపీఎస్ ఉద్యోగులు చెల్లించిన వాటా డబ్బు ఏమైంది?: దేవినేని

అమరావతి: సీపీఎస్ ఉద్యోగులతో ప్రభుత్వ చెలగాటమాడుతోందంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘సీపీఎస్ ఉద్యోగులతో ప్రభుత్వ చెలగాటం. 5నెలలుగా వారి ప్రాన్ ఖాతాల్లో జమకాని 500 కోట్ల కంట్రిబ్యూషన్. ఉద్యోగులు చెల్లించిన వాటా డబ్బు ఏమయ్యింది? అధికారంలోకొచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని ఉద్యోగులను మోసం చేసి, నేడు వారి జీవితాలతో చెలగాటమాడుతున్న మాట వాస్తవంకాదా? వైఎస్ జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 



Updated Date - 2021-08-21T14:55:03+05:30 IST