కరోనా మాటున కాసుల కోసం కక్కుర్తి: దేవినేని

ABN , First Publish Date - 2021-05-10T15:31:49+05:30 IST

కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తూ దోపిడీకి పాల్పడటంపై

కరోనా మాటున కాసుల కోసం కక్కుర్తి: దేవినేని

అమరావతి: కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తూ దోపిడీకి పాల్పడటంపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘కరోనాతో చావులోనూ ప్రశాంతత కరువు. మృతదేహం తరలింపు మాటున అడ్డగోలు దోపిడీ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున డిమాండ్ చికిత్స కంటే అంత్యక్రియల ఖర్చే ఎక్కువ కరోనా మాటున కాసుల కోసం కక్కుర్తి. ప్రభుత్వాసుపత్రుల ఎదుటే యధేచ్ఛగా దందా. ఇదేం కర్మ అంటున్న బాధిత కుటుంబాల ఆవేదన వినబడుతుందా? వైఎస్ జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 



Updated Date - 2021-05-10T15:31:49+05:30 IST