ప్రజా పాదయాత్రగా రైతుల మహాపాదయాత్ర: Devatoti

ABN , First Publish Date - 2021-11-08T14:36:41+05:30 IST

అమరావతి రైతుల పాదయాత్ర ప్రజా పాదయాత్రగా మారిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు.

ప్రజా పాదయాత్రగా రైతుల మహాపాదయాత్ర: Devatoti

అమరావతి: అమరావతి రైతుల పాదయాత్ర ప్రజా పాదయాత్రగా మారిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ పాదయాత్రకు మద్దతుగా సంఘటిత శక్తిగా నిలుస్తున్నారని తెలిపారు. గాంధీజీ పాదయాత్ర భారత దేశానికి స్వాతంత్రం తీసుకొస్తే అమరావతి రైతుల పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధానిని తీసుకొస్తుందన్నారు. ప్రతి గ్రామంలో కుల, మతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ  ప్రజలు స్వచ్ఛందంగా అమరావతి రాజధానికి మద్దతు పలుకుతూ ఉంటే వైసీపీ ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. అందుకే అడుగడుగునా ప్రతి బంధకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. జగన్ రెడ్డి ఇకనైనా నియంతృత్వ పోకడలు విడనాడి ప్రజాభీష్టం మేరకు అమరావతి రాజధానిగా కొనసాగించాలని దేవతోటి నాగరాజు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-11-08T14:36:41+05:30 IST