సీఎం ఇకనైనా మహిళల భద్రతకు చర్యలు చేపట్టాలి: దేవతోటి

ABN , First Publish Date - 2021-07-26T14:16:52+05:30 IST

మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలకు భద్రత లేక పోవడం బాధాకరమని టీడీపీ నేత దేవతోటి నాగరాజు అన్నారు.

సీఎం ఇకనైనా మహిళల భద్రతకు చర్యలు చేపట్టాలి: దేవతోటి

అమరావతి: మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో  మహిళలకు భద్రత లేక పోవడం బాధాకరమని టీడీపీ నేత దేవతోటి నాగరాజు అన్నారు. హోంమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ కిడ్నాప్ జరిగిందంటే రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో మహిళలు గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా జీవిస్తే  వైసీపీ పాలనలో అదే గుండెను అరచేతిలో పెట్టుకుని భయాందోళతో బ్రతుకుతున్నారన్నారు. వైసీపీ పాలనలో 6 నెలల పసిబిడ్డ నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు కూడా భద్రత లేదని విమర్శించారు. ఆడబిడ్డలకు కనీస రక్షణ ఇవ్వకపోతే ప్రభుత్వం ఎందుకని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి ఇకనైనా  మహిళల భద్రతకు చర్యలు చేపట్టాలని దేవతోటి నాగరాజు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-07-26T14:16:52+05:30 IST