ప్రభుత్వానికి పూచికపుల్లలా దళితుల ప్రాణాలు: దేవతోటి

ABN , First Publish Date - 2021-05-13T18:49:12+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోతున్నా కొవిడ్ బాధితుల్లో అత్యధికులు నిస్సహాయులైన దళితులే అని టీడీపీ నేత దేవతోటి నాగరాజు అన్నారు.

ప్రభుత్వానికి పూచికపుల్లలా దళితుల ప్రాణాలు: దేవతోటి

అమరావతి: ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోతున్నా కొవిడ్ బాధితుల్లో అత్యధికులు నిస్సహాయులైన దళితులే అని టీడీపీ నేత దేవతోటి నాగరాజు అన్నారు. అత్యధిక దళిత ఉద్యమకారులు చనిపోవడం ఎంతో బాధాకరమని తెలిపారు. దళితుల ప్రాణాలు ప్రభుత్వానికి పూచికపుల్లలా అయిపోయాయని మండిపడ్డారు. మేధావుల మౌనం.. మూర్ఖుల సంఖ్య రెట్టింపుకు కారణమవుతుందని తెలిపారు. ఇది ఎదిగే సమాజ ఉనికికే ప్రమాదం అన్న నెల్సన్ మండేలా స్ఫూర్తితో దళిత మేధావులంతా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని దేవతోటి నాగరాజు కోరారు. 


Updated Date - 2021-05-13T18:49:12+05:30 IST