ఆర్కేను విమర్శించే స్థాయి జగన్కు లేదు: Devathoti
ABN , First Publish Date - 2022-03-17T14:04:57+05:30 IST
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను విమర్శించే స్థాయి సీఎం జగన్ రెడ్డి, వైసీపీ నేతలకు లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు.
అమరావతి: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను విమర్శించే స్థాయి సీఎం జగన్ రెడ్డి, వైసీపీ నేతలకు లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. ప్రజా ప్రయోజనాలకే తప్ప జగన్ రెడ్డి, వైయస్సార్ వంటి నేతల నియంతృత్వ పోకడలకు తలొగ్గకుండా.. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి తిమింగలాలను ఎప్పటికప్పుడు బయటపెడుతూ ముందుకు సాగే దమ్మున్న చానల్ ఏబీఎన్ అని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీలే కాకుండా అగ్ర వర్ణాలలోని పేద ప్రజల తరఫున పోరాడుతున్న చానల్ ఏబీఎన్ అని పేర్కొన్నారు. నాగరిక సమాజంలో అనాగరికంగా బతుకుతున్న నేత కొడాలి నాని అని విమర్శించారు. కొడాలి నాని మాటలు సభ్యసమాజం తలదించుకునేలాగే ఉంటాయన్నారు. ‘‘మీ బూతు మాటలతో మీడియాను నియంత్రించాలనుకోవడం కలలో కూడా జరగని పని’’ అని స్పష్టం చేశారు. పదవుల కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్న చరిత్ర కొడాలి నానిది అని దేవతోటి నాగరాజు వ్యాఖ్యలు చేశారు.