బాలయోగి దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక: Devathoti
ABN , First Publish Date - 2022-03-03T15:52:58+05:30 IST
దివంగత నేత జీఎంసీ బాలయోగి దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు.
అమరావతి: దివంగత నేత జీఎంసీ బాలయోగి దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. బాలయోగి 20వ వర్ధంతి సందర్భంగా దేవితోటి ఘనంగా నివాళి అర్పించారు. లోక్సభ స్పీకర్ వరకు అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి అని అన్నారు. చంద్రబాబు హయాంలో బాలయోగి రాష్ట్ర మంత్రివర్గం నుంచి లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారని తెలిపారు. టీడీపీ హయాంలో దళితులు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తే.. జగన్ రెడ్డి దళితులను పాతాళంలోకి తొక్కేస్తున్నారని విమర్శించారు. కోనసీమ అభివృద్ధి ప్రదాత అని... బాలయోగి సేవలు చిరస్మరణీయమని దేవతోటి నాగరాజు కొనియాడారు.