ఆర్కేపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు ప్రభుత్వ దిగజారుడుతనానికి పరాకాష్ట: Devathoti
ABN , First Publish Date - 2021-12-13T16:47:10+05:30 IST
ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రభుత్వ దిగజారుడుతనానికి పరాకాష్ట అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు.
అమరావతి: ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రభుత్వ దిగజారుడుతనానికి పరాకాష్ట అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ సీఐడీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవస్థ కోసం కాకుండా స్వార్థపూరిత వ్యక్తుల కోసం పనిచేయడం రాష్ట్ర తిరోగమనానికి పునాదని వ్యాఖ్యానించారు. జీరో ఎఫ్ఐఆర్ వంటి అరుదైన కేసును.. రాధాకృష్ణపై అన్యాయంగా, అక్రమంగా ప్రయోగించడం ప్రభుత్వ రంగ సంస్థల పతనానికి నాందన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని, అన్యాయాలను, అక్రమాలను బయట పెడుతున్నారని రాధాకృష్ణపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపించాల్సిన ప్రభుత్వ అధికారులు.. మీడియా రంగంలో అత్యున్నత స్థానంలో ఉన్న రాధాకృష్ణ లాంటి వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏoటి అని దేవతోటి నాగరాజు ప్రశ్నించారు.