జస్టిస్ చంద్రు మాటలు పూర్తిగా ఆక్షేపణీయం: Devatoti

ABN , First Publish Date - 2021-12-12T15:25:04+05:30 IST

న్యాయవాదిగా, న్యాయమూర్తిగా విశేష సేవలందించిన చంద్రు రాష్ట్రంలోని పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు.

జస్టిస్ చంద్రు మాటలు పూర్తిగా ఆక్షేపణీయం: Devatoti

అమరావతి: న్యాయవాదిగా, న్యాయమూర్తిగా విశేష సేవలందించిన చంద్రు  రాష్ట్రంలోని పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. ఆయన మాటలు పూర్తిగా ఆక్షేపణీయమన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు జై భీమ్ చిత్రంలోని పరిస్థితుల కంటే అధ్వానంగా, దారుణంగా ఉన్నాయని తెలిపారు. డాక్టర్ సుధాకర్, మదనపల్లి ఓం ప్రకాష్, చీరాల కిరణ్ వంటి వ్యక్తుల ఉదంతాలు రాష్ట్రంలోని అధ్వాన్న పరిస్థితికి అద్దం పడుతాయని చెప్పారు. చంద్రు ఏపీలోని వాస్తవ పరిస్టితులు చూస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వారిలో మొదటి వ్యక్తి ఆయనే అవుతారని దేవతోటి నాగరాజు పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-12T15:25:04+05:30 IST