జగన్‌ రెడ్డి...ఇకనైనా కక్ష సాధింపులు మాని...: Devathoti

ABN , First Publish Date - 2022-06-20T18:31:30+05:30 IST

వైసీపీ ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నిస్తున్నందుకే టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిపై కక్ష సాధింపులు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు

జగన్‌ రెడ్డి...ఇకనైనా కక్ష సాధింపులు మాని...: Devathoti

అమరావతి: వైసీపీ ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నిస్తున్నందుకే టీడీపీ నేత అయ్యన్న పాత్రుడి(Ayyanna patrudu)పై కక్ష సాధింపులు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు(Devathoti nagaraju) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షనేతల ఇళ్ల గోడలు కూల్చుతున్న అరాచక ప్రభుత్వం ప్రజల చేతిలో కూలిపోక తప్పదని హెచ్చరించారు. జగన్ రెడ్డి బెదిరింపులకు భయపడేవారెవరూ టీడీపీ లేరన్నారు. ‘‘జగన్ రెడ్డి.. ఇకనైనా కక్ష సాధింపులు మాని  రాష్ట్రాభివృద్దిపై దృష్టి పెట్టండి’’ అంటూ దేవతోటి నాగరాజు హితవుపలికారు. 

Updated Date - 2022-06-20T18:31:30+05:30 IST