జగన్‌ను సీఎం చేయడమే ప్రజలు చేసుకున్న పాపమా: Devathoti

ABN , First Publish Date - 2022-05-06T15:05:26+05:30 IST

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయడమే ప్రజలు చేసుకున్న పాపమా అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు వ్యాఖ్యలు చేశారు.

జగన్‌ను సీఎం చేయడమే ప్రజలు చేసుకున్న పాపమా: Devathoti

అమరావతి: వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయడమే ప్రజలు చేసుకున్న పాపమా అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో ప్రతి రోజూ ఏదో ఒక మూల హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నా ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోగా..ప్రతిపక్షాలు నానాయాగీ చేస్తున్నాయని అనడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ప్రజల బాగోగుల పట్ల బాధ్యత, ప్రజలు అంటే గౌరవంలేని ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్ రెడ్డి మాత్రమే ఉన్నారని విమర్శించారు. జగన్ దృష్టిలో ప్రజలంటే ఓటు బ్యాంకు మాత్రమే అని అన్నారు. ముఖ్యమంత్రి పదవి తన కష్టాలు తీర్చుకోవడానికి తప్ప.. ప్రజల కోసం ఏ ఒక్క రోజు కూడా పనిచేయడం లేదని దేవతోటి నాగరాజు విమర్శలు గుప్పించారు. 

Read more