విజయవాడలో అత్యాచార ఘటన మానవత్వానికి సిగ్గుచేటు: Devathoti

ABN , First Publish Date - 2022-04-23T14:17:26+05:30 IST

విజయవాడ లాంటి సిటీలో ఒక మహిళపై అమానుషంగా అత్యాచారానికి పాల్పడటం మానవత్వానికి సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడలో అత్యాచార ఘటన మానవత్వానికి సిగ్గుచేటు: Devathoti

అమరావతి: విజయవాడ లాంటి సిటీలో ఒక మహిళపై అమానుషంగా అత్యాచారానికి పాల్పడటం మానవత్వానికి సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అత్యధికంగా మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన చంద్రబాబుతో అమర్యాదగా ప్రవర్తించారని మండిపడ్డారు. బాధితులను పరామర్శించే స్వేచ్ఛ కూడా లేని నియంతృత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందన్నారు. అధికారం కోసం ప్రజల చుట్టూ తిరిగిన జగన్ రెడ్డి... అదే ప్రజలు ఎన్నో ఇబ్బందులు, బాధలకు గురవుతున్న కనీసం పరామర్శించడానికి కూడా రాకపోవడం ఆయనలోని అధికార అహంభావానికి నిదర్శనమని దేవతోటి నాగరాజు వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-04-23T14:17:26+05:30 IST