పెరుతున్న ధరలకు హద్దూ అదుపూ లేదు: Devathoti

ABN , First Publish Date - 2022-04-15T14:54:18+05:30 IST

రాష్ట్రంలో పెరుగుతున్న ధరలకు హద్దూ అదుపూ లేకుండా పోతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు.

పెరుతున్న ధరలకు హద్దూ అదుపూ లేదు: Devathoti

అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న ధరలకు హద్దూ అదుపూ లేకుండా పోతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. పెరిగిన విద్యుత్ చార్జీలతో సతమతమౌతుంటే.. అదనంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో పేదవాడి బతుకు బుగ్గిపాలు అవుతోందని మండిపడ్డారు. జగన్ రెడ్డికి పరిపాలనపై పట్టు లేకపోవడం.. ప్రజల బాగోగులపై విశాలంగా ఆలోచించగల మనసు లేకపోవడం వల్లే నిత్యం ఏదో ఒక ధర పేద ప్రజలపై యుద్ధం చేస్తోందని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు ఒక అంతం అంటూ లేదన్నారు. క్రమశిక్షణ గల నాయకుడు ఉన్నప్పుడే క్రమబద్ధమైన పాలన ప్రజలకు అందుతుందని తెలిపారు. జగన్ రెడ్డిలో క్రమశిక్షణ లేదు గనకే ధరల పెరుగుదల సంభవిస్తోందని దేవతోటి నాగరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2022-04-15T14:54:18+05:30 IST