పరుష పదజాలం జగన్కు మాత్రమే చెల్లింది: Devathoti
ABN , First Publish Date - 2022-04-09T14:05:01+05:30 IST
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి "వెంట్రుక కూడా పీకలేరు" అంటూ పరుష పదజాలం వాడటం ఒక్క జగన్ రెడ్డికి మాత్రమే చెల్లిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి "వెంట్రుక కూడా పీకలేరు" అంటూ పరుష పదజాలం వాడటం ఒక్క జగన్ రెడ్డికి మాత్రమే చెల్లిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. రాష్ట్ర నలుమూలల ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. ప్రజలు జగన్ రెడ్డిని శాశ్వతంగా రాజకీయ అనర్హుడిని చేయబోతున్నారని.. అందుకే సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. ఫ్యాక్షన్ మూలాల నుంచి ఎదిగిన జగన్ రెడ్డికి సభ్యసమాజం హర్షించే మాటలు వస్తాయి అనుకోవటం మన పొరపాటే అవుతుందని దేవతోటి నాగరాజు వ్యాఖ్యానించారు.