దళిత ఎమ్మార్వోపై దాడి నిరంకుశ విధానాలకు పరాకాష్ట: Devathoti

ABN , First Publish Date - 2022-02-17T16:36:40+05:30 IST

గుడివాడ దళిత ఎమ్మార్వోపై వైసీపీ నేతలు సాక్షాత్తు కొడాలి నాని సమక్షంలో అమానుషంగా దాడికి పాల్పడటం వారి నిరంకుశ విధానాలకు పరాకాష్ట అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు విమర్శలు గుప్పించారు.

దళిత ఎమ్మార్వోపై దాడి నిరంకుశ విధానాలకు పరాకాష్ట: Devathoti

అమరావతి: గుడివాడ దళిత ఎమ్మార్వోపై వైసీపీ నేతలు సాక్షాత్తు కొడాలి నాని సమక్షంలో అమానుషంగా దాడికి పాల్పడటం వారి నిరంకుశ విధానాలకు పరాకాష్ట అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు విమర్శలు గుప్పించారు. మంత్రి చోద్యం చూస్తూ నిలబడటం ప్రభుత్వ అధికారుల పట్ల వారి చులకన భావానికి ప్రతీకన్నారు. ప్రజల ఓటు హక్కుతో అధికారంలోకి వచ్చి.. అదే ప్రజలను, ప్రభుత్వ అధికారులను ఇబ్బందులకు గురిచేయడం వైసీపీ నేతలకే చెల్లిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వానికి చోటు లేదని తెలిపారు. ప్రభుత్వ అధికారులను వేధిస్తున్న ప్రభుత్వం సెలవు చీటీ తీసుకోకతప్పదని దేవతోటి నాగరాజు హెచ్చరించారు. 

Updated Date - 2022-02-17T16:36:40+05:30 IST