వైసీపీ నేతల తీరుతో ప్రజాస్వామ్యం అపహాస్యం: డాక్టర్ శ్యామ్ చంద్ర

ABN , First Publish Date - 2021-10-23T00:25:37+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్

వైసీపీ నేతల తీరుతో ప్రజాస్వామ్యం అపహాస్యం: డాక్టర్ శ్యామ్ చంద్ర

జంగారెడ్డిగూడెం (పశ్చిమ గోదావరి): రాష్ట్రంలో వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ఆరోపించారు. టీడీపీ  అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పోరు దీక్షలో ఆయన మాట్లాడారు. టీడీపీ కేంద్ర కార్యాలయం మీద వైసీపీ నేతల దాడికి నిరసనగా చంద్రబాబు చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు దీక్షకు చింతలపూడి నియోజకవర్గం నుంచి శ్యామ్ చంద్ర పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా వేదిక మీద ఆయన మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష పార్టీల నేతలపై, కార్యాలయాలపై దాడులకు తెగబడి తిరిగి మీరే కేసులు పెట్టడం దారుణమన్నారు. ఇలాంటి కేసులకు టీడీపీ భయపడేది లేదన్నారు.


వైసీపీ ఎంత ఇబ్బంది పెడితే దానికి అంత రెట్టింపు వేగంతో ముందుకు సాగుతామన్నారు. వైసీపీ మీద జనాలు ఆగ్రహంతో ఉన్నారని తెలిసి జనాగ్రహ దీక్ష చేపట్టారా అని ఆయన వైసీపీ నేతలను ఎద్దేవా చేశారు. పెన్షన్స్, విద్యుత్, పెట్రోల్, డీజిల్, వారంలో సీపీఎస్ రద్దు ఇలా అన్ని విషయాలలో మడమ తిప్పిన ముఖ్యమంత్రిని ఇంకేం అనాలని శ్యామ్ చంద్ర ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకి యువత సంపూర్ణ మద్దతు ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇలాంటి దాడులను ఖండించాలని కోరారు. చింతలపూడి నియోజకవర్గం నుంచి పూర్తి మద్దతును అధినేతకు తెలియజేస్తున్నామని డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-23T00:25:37+05:30 IST