AP News: సుస్థిర అభివృద్ధి రేటు అంటే ఏంటో సీఎం జగన్‌కు తెలుసా..?: యనమల

ABN , First Publish Date - 2022-07-22T20:32:51+05:30 IST

సుస్థిర అభివృద్ధి రేటు అంటే ఏంటో సీఎం జగన్‌కు తెలుసా..? అని టీడీపీ నేత యనమల ప్రశ్నించారు.

AP News: సుస్థిర అభివృద్ధి రేటు అంటే ఏంటో సీఎం జగన్‌కు తెలుసా..?: యనమల

కాకినాడ (Kakinada): సుస్థిర అభివృద్ధి రేటు అంటే ఏంటో సీఎం జగన్‌ (CM Jagan)కు తెలుసా..? అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) ప్రశ్నించారు. శుక్రవారం తుని(Tuni)లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిత్యావసర రేట్లు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ధరలు  తగ్గించడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలైందన్నారు. ఏపీ (AP)కి త్వరలో శ్రీలంక పరిస్థితి (Sri Lanka situation) వస్తాదన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించిందన్నారు. అప్పుల ఊబిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఎనిమిది లక్షల  కోట్లకు అప్పులు పెరిగాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం నిలిచిపోయిందని, రాష్ట్రంలో మరింత పేదరికం పెరిగిందన్నారు. బీహార్ (Bihar), ఒడిస్సా (Odisha)ల కన్నా ఏపీ వెనుకబడిందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని వదిలించుకోవాలని చూస్తున్నారని యనమల రామకృష్ణుడు అన్నారు.

Updated Date - 2022-07-22T20:32:51+05:30 IST