పీఆర్ మోహన్ మరణం అత్యంత బాధాకరం: చినరాజప్ప
ABN , First Publish Date - 2021-07-12T16:31:24+05:30 IST
శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాప్ చైర్మన్ పి ఆర్ మోహన్ మరణం
అమరావతి: శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాప్ చైర్మన్ పి ఆర్ మోహన్ మరణం అత్యంత బాధాకరమని టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.