రైతులను ఆదుకోవాలి : చెంచలబాబు

ABN , First Publish Date - 2021-12-03T03:44:03+05:30 IST

మండలంలోని ఊటుకూరు, తక్కెళ్లపాడు, నందిగుంట గ్రామాల్లోని మినుము పంటను, చెరువులను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నెబోయిన చెంచలబాబుయాదవ్‌ గురువారం పరిశీలించారు.

రైతులను ఆదుకోవాలి : చెంచలబాబు
పంటలు పరిశీలిస్తున్న చెంచలబాబు

వింజమూరు, డిసెంబరు 2: మండలంలోని ఊటుకూరు, తక్కెళ్లపాడు, నందిగుంట గ్రామాల్లోని మినుము పంటను, చెరువులను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నెబోయిన చెంచలబాబుయాదవ్‌ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో మినుము పంట వర్షాలకు పూర్తిగా దెబ్బతిందని, దీనిపై వెంటనే ఆర్థికసాయం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. ఊటుకూరు, జువ్విగుంటపాళెం చెరువుకట్టలు ప్రమాదపుటంచున ఉన్నాయని, వాటిని యుద్ధప్రాతిపదికన బాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గూడా నరసారెడ్డి, ఖాజామొహీద్దీన్‌, తోడిందుల వెంకటేశ్వర్లయాదవ్‌, నరేంద్ర, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-03T03:44:03+05:30 IST