రాజారెడ్డి రాజ్యాంగానికి మరో మూడేళ్లే వ్యాలిడిటీ: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-06-23T18:51:03+05:30 IST

వైసీపీ పాలనలో రాజ్యాంగం, చట్టం అడుగడుగునా దుర్వినియోగం అవుతున్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విమర్శించారు.

రాజారెడ్డి రాజ్యాంగానికి మరో మూడేళ్లే వ్యాలిడిటీ: చంద్రబాబు

అమరావతి: వైసీపీ పాలనలో  రాజ్యాంగం,  చట్టం అడుగడుగునా దుర్వినియోగం అవుతున్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విమర్శించారు. అచ్చెన్నాయుడు కుటుంబసభ్యులపై పోలీసులు బైండోవర్ కేసులను నమోదు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.  దేశంలో కరోనా కేసులు తగ్గినా ఏపీలో  ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు తగ్గడం లేదని వ్యాఖ్యానించారు. అక్రమ కేసులకు రౌడీ షీట్లకు భయపడే నాయకులు  టీడీపీలో లేరన్నారు.  రాజారెడ్డి రాజ్యాంగానికి మరో మూడేళ్లే వ్యాలిడిటీ అని అన్నారు. అధికారం ఉంది కదా అని జగన్ రెడ్డి అరాచకంగా వ్యవహరిస్తే ముందు రోజుల్లో మూడింతలు మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. హరివరప్రసాద్, సురేష్, కృష్ణమూర్తిపై పోలీసులు పెట్టిన అక్రమ రౌడీషీట్ వెంటనే ఎత్తి వేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-06-23T18:51:03+05:30 IST