ప్రధాని, లోక్సభ స్పీకర్కు Chandrababu లేఖ
ABN , First Publish Date - 2022-07-02T18:34:39+05:30 IST
అల్లూరి 125వ జయంతి వేడుకలు సందర్భంగా పార్లమెంటులో సీతారామరాజు విగ్రహాన్ని
అమరావతి: అల్లూరి (Alluri) 125వ జయంతి వేడుకలు సందర్భంగా పార్లమెంటులో సీతారామరాజు (sitarama raju) విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరుతూ ప్రధాని మోదీ (Modi), లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా (Om prakash birla)కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో అల్లూరిని చేర్చడం తెలుగుజాతికి గర్వకారణమన్నారు. పార్లమెంట్ (Parliament)లో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు వాజ్పేయి (Vajpayee) సర్కార్ నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. నాడు కేంద్రం, ఉమ్మడి ఏపీలో ప్రభుత్వాలు మారడంతో అల్లూరి విగ్రహ ఏర్పాటులో జాప్యం జరిగిందన్నారు. పార్లమెంట్లో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అల్లూరిని సత్కరించుకోవడమంటే దేశ స్ఫూర్తి, గిరిజన జాతులను గౌరవించుకోవడమే అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.