Chittoor: చంద్రబాబు రెండో రోజు పర్యటనలోనూ ప్లెక్సీల రగడ
ABN , First Publish Date - 2021-10-30T19:07:34+05:30 IST
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండవ రోజు పర్యటనలోనూ ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది.
చిత్తూరు: కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండవ రోజు పర్యటనలోనూ ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. గుడిపల్లి మండలం గుంజా రాళ్ళపల్లి వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించివేశారు. అటు మండల కేంద్రమైన శాంతిపురంలోనూ టీడీపీ ఫ్లెక్సీలను చించివేశారు. చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన నేపథ్యంలో నిన్నటి రోజు ఆర్అండ్బి గెస్ట్ హౌస్ సమీపంలోని లక్ష్మీపురం వద్ద టీడీపీ బ్యానర్లను గుర్తుతెలియని దుండగులు చించివేయగా.... దీనికి ప్రతీకారంగా వైసీపీ బ్యానర్లను టీడీపీ శ్రేణులు చించివేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో రెండో రోజు కూడా టీడీపీ బ్యానర్లను గుర్తుతెలియని దుండగులు చించివేయడంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.