కుప్పంలో ముగిసిన చంద్రబాబు పర్యటన
ABN , First Publish Date - 2021-02-27T15:19:20+05:30 IST
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన ముగిసింది.
చిత్తూరు: కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన ముగిసింది. కుప్పంలోని ఆర్అండ్బి అతిథి గృహంలో టీడీపీ శ్రేణులు, ప్రజల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ఐ టీడీపీ యువకులతో సమావేశమైన చంద్రబాబు... ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వం, ప్రజలకు చేస్తున్న దౌర్జన్యాలను ఎత్తి చూపించాలని వారికి సూచనలు చేశారు. మూడు నెలలకు ఒకసారి చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తారని కార్యకర్త తెలిపారు. కుప్పంలో మూడు రోజుల పర్యటన ముగించుకొన్న చంద్రబాబు బెంగళూరు ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఫ్లైట్లో హైదరాబాద్కు చంద్రబాబు చేరుకోనున్నారు.