బానిసత్వపు సంకెళ్లను తెంచుకున్న రోజు ఇది: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-08-15T13:47:43+05:30 IST

దేశ ప్రజలందరికీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలియాజేశారు.

బానిసత్వపు సంకెళ్లను తెంచుకున్న రోజు ఇది: చంద్రబాబు

అమరావతి: దేశ ప్రజలందరికీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలియాజేశారు. ‘‘బానిసత్వపు సంకెళ్ళను తెంచుకుని స్వేచ్చను పొందిన రోజు ఇది. హక్కుల కోసం పోరాడి విజయం సాధించిన శుభదినం. ఏ దేశంలోనూ లేని రీతిలో ప్రాథమిక హక్కులను, ఆదేశిక సూత్రాలను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను మనకు అందించారు పెద్దలు. సాధించుకున్న హక్కులను ఎక్కడ కాలరాసినా, వ్యవస్ధలను కూలదోసినా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా... వాటిని నిలబెట్టుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉంది. లేదంటే దేశం కోసం మహనీయులు చేసిన త్యాగాలను వృధా పరచిన వాళ్ళం అవుతాం. దేశ ప్రజలందరికీ స్వాంతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.



Updated Date - 2020-08-15T13:47:43+05:30 IST