ఉత్తరాంధ్ర భూకాసురుడు ఎవరో దేశం మొత్తం తెలుసు: బుద్దా వెంకన్న
ABN , First Publish Date - 2022-04-16T16:59:08+05:30 IST
ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ: ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర భూకాసురుడు ఎవరో దేశం మొత్తం తెలుసన్నారు. ‘‘మీది కుల పార్టీనా? మాది కుల పార్టీనా తేల్చుకుందాం రా’’ అంటూ సవాల్ విసిరారు. జగన్ అవినీతిలో భాగమై జైలుకెళ్లినందుకే రాజ్యసభ సీటు వచ్చిందన్నారు. రాష్ట్రంలో లక్షలాది మందికి పని లేకుండా చేసిన ఘనుడు జగన్ అని మండిపడ్డారు. ఇప్పుడు జాబ్ మేళా అంటూ జగన్నాటకం మొదలు పెట్టారన్నారు. చెప్పింది చేసేవారికే జగన్ మంత్రి పదవులిచ్చారని విమర్శించారు. బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుండాలన్నారు. బీసీలకు ఇచ్చే పథకాలను జగర్ రద్దు చేసింది వాస్తవం కాదా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.