వైసీపీ నాయకులే దొంగ సారా అమ్ముతున్నారు: Bonda uma

ABN , First Publish Date - 2022-03-14T15:50:44+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటు సారా ఏరులై పారుతోందని... వైసీపీ నాయకులే దొంగ సారా అమ్ముతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూర్ సభ్యులు బోండా ఉమా ఆరోపించారు.

వైసీపీ నాయకులే దొంగ సారా అమ్ముతున్నారు: Bonda uma

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటు సారా ఏరులై పారుతోందని... వైసీపీ నాయకులే దొంగ సారా అమ్ముతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా ఆరోపించారు. కల్తీ సారా వల్లే జంగారెడ్డగూడెంలో అనేకమంది చనిపోయినా వైసీపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ నాయకుల డబ్బు ఆశకు అంతులేకుండా పోయిందని మండిపడ్డారు. గంజాయి, నాటు సారా, కల్తీ మద్యం విచ్చల విడిగా అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డగూడెం మృతులకు నష్టపరిహారం ఇవ్వాలని, మృతి చెందిన ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. దొంగ సారా అమ్మిన వైసీపీ నాయకులను అరెస్టు చేయాలని బోండా ఉమా చేశారు. 

Updated Date - 2022-03-14T15:50:44+05:30 IST