వైసీపీకి డబ్బు పైచ్యం పట్టుకుంది: Bonda uma

ABN , First Publish Date - 2021-10-06T14:55:26+05:30 IST

వైసీపీకి డబ్బు పైచ్యం పట్టుకుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా వ్యాఖ్యానించారు.

వైసీపీకి డబ్బు పైచ్యం పట్టుకుంది: Bonda uma

అమరావతి: వైసీపీకి డబ్బు పైచ్యం పట్టుకుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా వ్యాఖ్యానించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా లూటీ చేస్తున్నారన్నారు. డ్రగ్స్, గంజాయి వ్యాపారంలో ముమ్మాటికి వైసీపీ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. ఏపీని డ్రగ్స్, గంజాయికి వైసీపీ హబ్‌గా మార్చిందని... దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీ ఉన్నాయన్నారు. వైసీపీ నాయకుల అండతోనే లక్షల టన్నులు గంజాయి పండిస్తున్నారని, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నరని ఆయన తెలిపారు. ఇప్పటికి రెండు లక్షల టన్నులు గంజాయి పట్టుకొన్నామని ప్రభుత్వమే చెపుతుందని,  పట్టుబడింది ఎన్ని లక్షల టన్నులు ఉంటాయో? అని ప్రశ్నించారు. జగన్‌పై పెట్టిన కేసులు సోనియా గాంధీని మేనేజ్ చేసి పెట్టించారని వైసీపీ అనటం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై వైఎస్ఆర్ 22 సార్లు హైకోర్టు, సుప్రీమ్ కోర్టు వెళ్లారని, అప్పుడు సోనియానే ఢిల్లీలో అధికారంలో ఉందన్నారు. చంద్రబాబు పాలనపై అనేక కమిటీలతో ఎంక్వైరీలు చేయించారని,  ఏ తప్పు జరగలేదని అన్ని కమిటీలు చెప్పాయని తెలిపారు. జగన్ అవినీతి సామ్రాట్ కాబట్టి 16 నెలలు జైలులో ఉన్నాడని,  ఇప్పటికి అనేక కేసులు ఉన్నాయని బోండా ఉమా పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-06T14:55:26+05:30 IST