దిశ చట్టం పేరుతో ప్రజలను మాయ చేస్తున్నారు: Bonda uma

ABN , First Publish Date - 2022-04-21T17:07:10+05:30 IST

సీపీ ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు.

దిశ చట్టం పేరుతో ప్రజలను మాయ చేస్తున్నారు: Bonda uma

విజయవాడ: వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... దిశ చట్టం పేరుతో ప్రజలను మాయ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం నివాసానికి సమీపంలో ఘటన జరిగినా చర్యలు లేవన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ముగ్గురు అత్యాచారం చేయడం దారుణమని అన్నారు. ఈ ఘటనలో నిందితులు వైసీపీ ఎమ్మెల్యే అనుచరులే అని చెప్పుకొచ్చారు. సీఎం, డీజీపీలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. చర్యలు తీసుకోక పోవడం వల్లే తరచూ దారుణాలు జరుగుతున్నాయన్నారు. ఆ తల్లి డిమాండ్ ప్రకారం నిందితులను ఉరి తీయాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. 




Updated Date - 2022-04-21T17:07:10+05:30 IST