అమరావతిలో భూములు కొనకూడదని చట్టంలో ఎక్కడుంది: బోండా

ABN , First Publish Date - 2020-09-19T16:27:09+05:30 IST

రాజధాని అమరావతిలో భూములు కొనకూడదని చట్టంలో ఎక్కడుందో వైసీపీ చెప్పాలని టీడీపీ నేత బోండా ఉమ ప్రశ్నించారు. ‘ఇన్‌ సైడర్ ట్రేడింగ్ అనేది

అమరావతిలో భూములు కొనకూడదని చట్టంలో ఎక్కడుంది: బోండా

అమరావతి: రాజధాని అమరావతిలో భూములు కొనకూడదని చట్టంలో ఎక్కడుందో వైసీపీ చెప్పాలని టీడీపీ నేత బోండా ఉమ ప్రశ్నించారు. ‘ఇన్‌ సైడర్ ట్రేడింగ్ అనేది బూటకం. జగన్ పాలనలో వన్ సైడర్ ట్రేడింగ్ జరుగుతుంది. వైసీపీ ఎంపీలు సిట్, ఏసీబీ తీర్పులపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కోర్టు బోనులో చేతులు కట్టుకుని నిలబడే వైసీపీ నాయకులు జడ్జీలకు చట్టాలు చెబుతున్నారు. వైఎస్.వివేకానందరెడ్డి హత్యపై జగన్ కోర్టు కెళ్తే అప్పటి సీఎం చంద్రబాబుపై హైకోర్టు తీర్పు వైసీపీకి గుర్తులేదా? దమ్మలపాటి కేసులో హైకోర్టు తీర్పు కొత్తేమీ కాదు. గతంలో గవర్నర్ తివారీ, మొన్న రకుల్ ప్రీతిసింగ్ కేసులో ఇదే విధంగా తీర్పులిచ్చాయి. కోర్టు తీర్పులపై ఇప్పుడు మాట్లాడుతున్న మేధావులు గత తీర్పులు కనపడడం లేదా? అమరావతిలో ఐఏఎస్, ఐపీఎస్, జడ్జీలకు జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చాం. గతంలో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సీఎంగా జీవో నెం.243 ద్వారా 2005లో జడ్జీలకు ఇంటి స్థలాలు ఇచ్చారు’ అని బోండా ఉమ గుర్తుచేశారు.

Updated Date - 2020-09-19T16:27:09+05:30 IST