అనూష కుటుంబానికి అండగా లోకేష్ ఉండటం తప్పా?: Bonda
ABN , First Publish Date - 2021-09-09T13:51:20+05:30 IST
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు.
అమరావతి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు అండగా టీడీపీ వుంటే వైసీపీ పోలీసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. అమల్లోలేని దిశా చట్టం మహిళలకు రక్షణగా ఉంటుందని వైసీపీ చెబుతుందని విమర్శించారు. దిశా చట్టంతో ఏ కేసులో నిందితుడికి శిక్ష వేశారో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేష్ నరసరావుపేట వెళితే వైసీపీ బండారం బట్టబయలు అవుతుందనే అడ్డుకుంటున్నారని అన్నారు. అనూష కుటుంబానికి అండగా లోకేష్ ఉండటం తప్పా అని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ను గాలికి వదిలేసిన వైసీపీ...టీడీపీ నేతలపై మాత్రం పోలీసులను ఉపయోగిస్తుందని బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.