ప్రభుత్వం వెంటనే ఆర్కేపై కేసును ఉపసంహరించుకోవాలి: బీద రవిచంద్ర

ABN , First Publish Date - 2021-12-14T16:41:42+05:30 IST

ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదు ఏపీలో కక్ష సాధింపులకు పరాకాష్ట అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం వెంటనే ఆర్కేపై కేసును ఉపసంహరించుకోవాలి: బీద రవిచంద్ర

నెల్లూరు: ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదు ఏపీలో కక్ష సాధింపులకు పరాకాష్ట అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ స్నేహితుడిగా, జర్నలిస్టుగా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లడం కూడా నేరమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఆర్కేపై కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో కక్షసాధింపులకి అడ్డూ అదుపు లేకుండా పోతోందని విమర్శించారు. స్నేహితుడిని పలకరించినా క్రిమినల్ కేసులు పెట్టేస్థాయికి వైసీపీ ప్రభుత్వం దిగజారిపోయిందని బీద రవిచంద్ర అన్నారు. 

Updated Date - 2021-12-14T16:41:42+05:30 IST