విశాఖలోనే పెందుర్తిని కొనసాగించాలి: మాజీ మంత్రి బండారు

ABN , First Publish Date - 2022-02-22T21:45:17+05:30 IST

పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని

విశాఖలోనే పెందుర్తిని కొనసాగించాలి: మాజీ మంత్రి బండారు

విశాఖపట్నం: పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి బండారు సత్య నారాయణ డిమాండ్ చేశారు. విశాఖలోనే పెందుర్తి కొనసాగింపుపై అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలోనే కొనసాగించాలని ముఖ్యమంత్రిని విశాఖ శారదాపీఠం స్వామిజీ ఆడగాలన్నారు. ఆయనకు కూడా ఆ బాధ్యత ఉందన్నారు. లేదంటే  పీఠం కూడా అనకాపల్లి వెళ్లిపోతుందన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే ఆదీప్ రాజు దీనిపైన సీఎంను ఆడగాల్సిన ఆవసరం ఉందన్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు పెందుర్తి జంక్షన్ వద్ద 25 నుంచి 27 వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. 

Updated Date - 2022-02-22T21:45:17+05:30 IST