ఇదేందయ్యా జగనూ....: Ayyannapatrudu

ABN , First Publish Date - 2022-03-08T19:44:34+05:30 IST

మాజీ సీఎం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి పట్ల ఏపీ అసెంబ్లీలో సంతాపం తెలియజేయకపోవడంపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఇదేందయ్యా జగనూ....: Ayyannapatrudu

అమరావతి: మాజీ సీఎం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి పట్ల ఏపీ అసెంబ్లీలో సంతాపం తెలియజేయకపోవడంపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ఇదేందయ్యా జగనూ.... మాజీ సీఎం, మాజీ గవర్నర్‌గా పనిచేసిన కొణిజేటి రోశయ్య గారికి కనీసం సభలో సంతాపం కూడా చెప్పడానికి మనసు రాలేదా?. నీ తండ్రి కి అత్యంత ఆత్మీయుడిగా మెలిగిన రోశయ్య గారు చనిపోతే నాడు నివాళికీ నువ్వు వెళ్లలేదు. నేడు కనీసం సభలో గౌరవంగా సంతాపం కూడా తెలుపలేదు. నాడు నీ నైజాన్ని, నిజ స్వరూపాన్ని ప్రపంచానికి తెలిపింది రోశయ్య గారు అనే నీకు ఇంత కక్ష అనేది బయట టాక్. నీ స్నేహితుడు అయిన గౌతమ్ రెడ్డికి సంతాపం తెలిపిన నువ్వు... మీ తండ్రి అన్నలా భావించిన రోశయ్యకు మాత్రం సంతాపం తెలుపలేదు’’ అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.


Updated Date - 2022-03-08T19:44:34+05:30 IST