‘మీ వాడికి దమ్ముంటే చర్చకు రమ్మను’... విజయసాయికి అయ్యన్న కౌంటర్
ABN , First Publish Date - 2022-06-10T19:44:30+05:30 IST
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతి సవాల్కు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు.
అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతి సవాల్కు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘దొంగలెక్కలు రాసి ఊచలు లెక్కెట్టిన నువ్వు.. సవాల్ విసరడం ఏంటి సాయిరెడ్డి?. నీ రేంజ్కి మా ఆఫీస్లో అటెండర్ చాలు. లోకేష్ చర్చకు సిద్ధం అన్నది జగన్తో.. మీ వాడికి దమ్ముంటే చర్చకు రమ్మను. ఎనీ బ్లూ మీడియా.. లోకేష్ ఈజ్ రెడీ’’ అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.
కాగా... పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిన్న(గురువారం) జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ నేతలు ప్రత్యక్షమయ్యారు. దీనిపై లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘విద్యార్థులను అడ్డుపెట్టుకుని దద్దమ్మల్లా మాట్లాడుతున్నారు. జూమ్లో కాదు... నేరుగా వచ్చినా మీరేమీ చేయలేరు. పదో తరగతి ఫెయిలైన వైసీపీ కుక్కల్ని పంపడం కాదు! జగన్ రెడ్డీ... స్వయంగా నువ్వే రా! పదో తరగతి ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గిందో నీ బ్లూ మీడియా చానల్లోనే చర్చించుకుందాం’’ అని లోకేశ్ సవాల్ చేశారు.
లోకేస్ సవాల్పై విజయసాయిరెడ్డి...
లోకేష్ సవాల్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.టెన్త్ ఫలితాల మీద కూడా పేలాలు ఏరుకోవడం ఏమిటి పప్పూ అంటూ లోకేష్ను ఎద్దేవా చేశారు. ‘‘జూమ్ మీటింగ్లోకి వస్తే మ్యూట్ చేశావు... ప్రత్యక్షంగా వస్తే తట్టుకోగలవా లోకేశం’’ అంటూ ఎంపీ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.