మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి హై కోర్టులో ఊరట

ABN , First Publish Date - 2022-02-24T20:20:56+05:30 IST

టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. సీఎంని దూషించారంటూ అయ్యన్నపాత్రుడిపై పశ్చిమ గోదావరి జిల్లాలో 505(2), 153(ఎ), 506 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి హై కోర్టులో ఊరట

అమరావతి: టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. సీఎంని దూషించారంటూ అయ్యన్నపాత్రుడిపై పశ్చిమ గోదావరి జిల్లాలో 505(2), 153(ఎ), 506 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. అయ్యన్నపాత్రుడి ఇంటికి వచ్చిన నల్లజర్ల పోలీసులు నోటీసులంటించారు. బుధవారం రాత్రి అయ్యన్నపాత్రుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. పోలీసుల చర్యలపై  అయ్యన్నపాత్రుడి తరపు న్యాయవాది సతీష్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయ్యన్నపై నమోదైన కేసుల్లో తదనంతర చర్యలపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఎటువంటి దూకుడు చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశించింది.కేసులో తదనంతర చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2022-02-24T20:20:56+05:30 IST