కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ల కాళ్ల మీద పడటం వైసీపీ చరిత్ర: అయ్యన్న

ABN , First Publish Date - 2020-09-22T17:48:15+05:30 IST

టీడీపీపై వైసీపీ నేత సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ల కాళ్ల మీద పడటం వైసీపీ చరిత్ర: అయ్యన్న

అమరావతి: టీడీపీపై వైసీపీ నేత సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.  కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళ కాళ్ళ మీద పడటం వైసీపీ చరిత్ర అని వ్యాఖ్యానించారు. యూపీఏ ప్రభుత్వం ప్రణబ్‌ను రాష్ట్రపతిగా పెడితే మద్దతు ఇచ్చిందని, ఎన్డీఏ ప్రభుత్వం కోవింద్‌ను పెడితే మద్దతు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. చంచల్ గూడ జైల్ నుంచి బెయిల్ కోసం సోనియా చుట్టూ తిరిగారని... మళ్ళీ లోపలికి పంపకుండా ఎన్డీయే చుట్టూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ ఆ రోజు ప్రణబ్‌కు గాని సంగ్మాకు గాని మద్దతు ఇవ్వలేదని... తటస్తంగా ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తేడా వస్తే కేంద్రంలో అధికారం కూడా వద్దనుకొని బయటకు వచ్చిందన్నారు. వైసీపీకి కేసులు ముఖ్యమని... టీడీపీకి రాష్ట్రం ముఖ్యమని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. 



Updated Date - 2020-09-22T17:48:15+05:30 IST